Asianet News TeluguAsianet News Telugu

డబ్బుల కోసం గొడవ.. అత్తను కాల్చి చంపిన అల్లుడు..

డబ్బులకోసం జరిగిన గొడవలో సొంత అత్తను తుపాకీతో కాల్చి చంపాడో అల్లుడు. అతను పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్నాడు. 
 

Fight for money, Son-in-law shot aunty In Hanamkonda - bsb
Author
First Published Oct 12, 2023, 12:27 PM IST

హనుమకొండ : తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. జిల్లాలోని గుడ్ల సింగారంలో ఓ అల్లుడు అత్తను హతమార్చాడు. డబ్బుల కోసం జరిగిన వివాదలో అత్త కమలమ్మను అల్లుడు ప్రసాద్ గన్ తో పేల్చి చంపేశాడు. ప్రసాద్ తోటపల్లి  పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్నాడు. తుపాకీతో కాల్చడంతో కమలమ్మకు రెండు బుల్లెట్లు తగిలాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios