Asianet News TeluguAsianet News Telugu

సిద్ధిపేట : ఎమ్మార్వో కార్యాలయం ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణుల బాహాబాహీ

సిద్ధిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎమ్మార్వో కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. 

fight between trs and bjp activists in siddipet
Author
First Published Nov 30, 2022, 4:41 PM IST

సిద్ధిపేటలో కొత్తగా నిర్మించిన అక్బర్‌పేట్ భూంపల్లి ఎంఆర్‌వో కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. అయితే బీజేపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీపోటీ నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అక్కడే వున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios