ఫీల్డ్ స్టోరీ: యాదాద్రి భూముల బూమ్ (వీడియో)
ఫీల్డ్ స్టోరీ: యాదాద్రి భూముల బూమ్
హైదరాబాద్: తెలంగాణలోని ముఖ్యమైన ఆలయాల్లో యాదగిరిగుట్ట ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధినేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దానికి యాదాద్రిగా నామకరణం చేశారు.
ఆలయంతో పాటు దాని చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగా రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు, పలు భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రకటన చేయడంతోనే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కసారిగా ఊపందుకుంది. లక్షల్లో ఉండే భూముల ధరలు కోట్లకు చేరుకున్నాయి.
ఈ రియల్ ఎస్టేట్ బూమ్ పై ఏషియానెట్ న్యూస్ ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. రియల్ ఎస్టేట్ బూమ్ పై ఈ ప్రత్యేక కథనం వీడియో చూడండి..
"