Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 14న హలియాలో కేసీఆర్ సభ: హైకోర్టులో రైతుల పిటిషన్

హలియాలో ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ పాల్గొనే సభకు స్థానికంగా అడ్డంకులు తప్పేలా లేవు.ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Farmers filed petitions against KCR meeting at Halia in Nalgonda district lns
Author
Nalgonda, First Published Apr 12, 2021, 2:16 PM IST

నల్గొండ: హలియాలో ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ పాల్గొనే సభకు స్థానికంగా అడ్డంకులు తప్పేలా లేవు.ఈ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14వ తేదీన సీఎం కేసీఆర్ హలియాలో నిర్వహించే సభలో పాల్గొనేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

అయితే హలియాలో రెండోసారి సీఎం కేసీఆర్ సభలో పాల్గొనడమంటేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.హలియాలో తమ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే సీఎం సభకు  ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు రైతులు సోమవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కోవిడ్ సమయంలో లక్ష మందితో సభ ఎలా నిర్వహిస్తారని ఆ పిటిషన్ లో రైతులు ప్రశ్నించారు.

ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ స్థానానికి ఈ నెల 15వ తేదీ వరకు ప్రచారం చేసుకొనేందుకు  ఈసీ అనుమతి ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి గడువుకు ముందు రోజు హలియాలో టీఆర్ఎస్ ఎన్నికల సభ ను ఏర్పాటు చేసింది.ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ హలియాలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు వరాలు కురిపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios