Asianet News TeluguAsianet News Telugu

దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ మీద పడింది.. తప్పుచేస్తే ఎంతటివారికైనాశిక్ష తప్పదు: బీజేపీ ఎమ్మెల్యే ఈటల

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎంతటివారికైనా శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు. టీఆర్ఎస్‌ను మట్టికరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. 

etela rajender Comments slams KCR Family
Author
First Published Dec 1, 2022, 4:46 PM IST

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ తన పేరును ప్రస్తావించడంపై స్పందించిన కవిత.. కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ పరిణామాలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఎంతటివారికైనా శిక్ష తప్పదని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఎవరి పాత్ర ఏమిటో దర్యాప్తు సంస్థలు తెలుస్తాయని  అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చెప్పారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఉందో?లేదో? దర్యాప్తులో తేలుతుందన్నారు. తెలంగాణ చాలదన్నట్టుగా కేసీఆర్ కుటుంబం దోచుకోవడానికి ఢిల్లీ మీద పడిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనే సంస్కృతికి తెరతీసింది కేసీఆరేనని విమర్శించారు. టీఆర్ఎస్‌ను మట్టికరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరును ప్రస్తావించడంపై కవిత స్పందించారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ.. దాన్ని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. 

Also Read: ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కవిత వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్

దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడితే.. ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐ‌లను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios