హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృస్టించిన పరువు హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నాగరాజు జాడ కోసం నిందితులు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. జీమెయిల్ ను హ్యాక్ చేసి నాగరాజు రియల్ టైమ్ లొకేషన్ ను తెలుసుకొని దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్ సరూర్ నగర్ పరువు హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మృతుడి నాగరాజు జాడను తెలుసుకునేందుకు నిందితులను అతడి ఈమెయిల్ ను హ్యాక్ చేశారు. దీంతో అతడి లోకేషన్ ను ఈజీగా తెలుసుకొని హత్యకు పాల్పడ్డారు. ఈ విషయాలను పోలీసుల విచారణలో బయటకు వచ్చాయి. నాగరాజు తన మొబైల్ ఫోన్ నంబర్ ను జీ -మెయిల్ ఐడీగా, అదే నంబర్ ను పాస్ వర్డ్ గా పెట్టుకున్నాడు. దీంతో పాటు అతడి మెయిల్ ఐడీలో టూ స్టెప్ అథెంటికేషన్ యాక్టివ్ గా లేకపోవడంతో నిందితులు ‘ఫైండ్ మై డివైజ్’ యాప్ ను ఉపయోగించి మే 4వ తేదీన నాగారాజు ఎక్కడ ఉన్నాడో కనుగొన్నారు. దీంతో ప్లాన్ చేసి అతడిపై దాడి చేశారు.
సంచలనం సృస్టించిన ఈ ఘటనలో ప్రమేయం ఉందనే కారణంతో బాలానగర్ కు చెందిన పండ్ల వ్యాపారి సయ్యద్ మోబిన్ అహ్మద్ (28) , అతని బావమరిది శేరిలింగంపల్లికి చెందిన కారు మెకానిక్ మహ్మద్ మసూద్ అహ్మద్ (29) అనే ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని విచారిస్తే నిందితులు ఈ వివరాలను వెల్లడించారు.
నిన్న సృజన.. నేడు లక్ష్మి.. మహబూబ్ నగర్ లో విషాదం.. పెళ్లైన కాసేపటికే నవ వధువు ఆత్మహత్య..
జనవరి 30వ తేదీన బాలానగర్ లోని ఐడీపీఎల్ కాలనీలో నివాసం ఉంటున్న అశ్రిన్ సుల్తానా తన సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు దళిత సామాజికవర్గానికి చెందిన నాగరాజు (25) ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 1న ఆమె కుటుంబ సభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
“ పెళ్లికి ఒకరోజు ముందు మా చెల్లి తన పేరును పల్లవిగా మార్చుకుని హిందూ సంప్రదాయం ప్రకారం నాగరాజును పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 3న మా సోదరి, నాగరాజు మా వద్దకు రావడంతో పోలీసులు మోమిన్ పేట పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. పోలీస్ స్టేషన్ లో నా సోదరిని విడిచిపెట్టాలని నేను నాగరాజును పట్టుబట్టాను. కానీ నా సోదరి నా మాటను తిరస్కరించి నాగరాజుతో కలిసి వెళ్లిపోయింది. కాబట్టి నేను నాగరాజుపై పగ పెంచుకున్నాను. మసూద్ సహాయంతో అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాను. ’’ అని మోబిన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో చెప్పాడు.
కత్తి, గొడ్డలితో కిరాతకంగా నరికి... ఆస్తి కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి కొడుకులు
నాగరాజుపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం నిందితులు నాగరాజు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని అనుకున్నారు. దీని కోసం అశ్రిన్ సుల్తానా ఇంట్లో వదిలివెళ్లిన ఫోన్ వారికి ఉపయోగపడింది. అందులో నుంచి నాగరాజు మెయిల్ ఐడీని, ఫోన్ నెంబర్ ను కనుగొన్నారు. అయితే ఇక్కడ నాగరాజు ఫోన్ నెంబర్, బెయిల్ ఐడీ పాస్ వర్డ్ ఒకటే కావడం వారికి కలిసి వచ్చింది. దీంతో వారు గూగుల్ అకౌంట్ కు దీనిని అటాచ్ చేశారు. ‘మై డివైజ్’ టూల్ లో వివరాలను ఫీడ్ చేయడం ద్వారా నిందితులు నాగరాజు రియల్ టైమ్ లొకేషన్ ను తెలుసుకున్నారు.
నాగరాజు టూ స్టెప్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయనందున నిందితులు ఫోన్ ను గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నాలు అతడికి నోటిఫికేషన్ రూపంలో రాలేదని పోలీసులు తెలిపారు. అయితే ఏప్రిల్ నెలలో నాగరాజు ఎక్కడో ఉన్నాడో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కానీ మే 4వ తేదీన నిందుతులు నాగరాజు లొకేషన్ ట్రాక్ చేయగలిగారు. నడిరోడ్డుపైన హత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఇప్పటికే నిందుతుల సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు కస్టోడియల్ విచారణ జరుపుతున్నారు.