సారాంశం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈ బృందం పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం సమీక్షించనుంది. ఈ పర్యటన సందర్భంగా వివిధ భాగస్వామ్య పక్షాలు, అధికారులను సంప్రదించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.