సంగారెడ్డిలో భూ ప్రకంపనలు .. రోడ్ల మీదకు పరుగులు పెట్టిన జనాలు , 10 రోజుల్లో రెండోసారి
రోజుల వ్యవధిలో సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కానీ పది రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
![earthquake in nyalkal mandal in sangareddy district ksp earthquake in nyalkal mandal in sangareddy district ksp](https://static-ai.asianetnews.com/images/01hkpaxyym18bwhd23as1hndpy/earthquake--1704777939924_363x203xt.jpg)
రోజుల వ్యవధిలో సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో 4 నుంచి 5 సెకన్ల మేర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్ధంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్లలోని సామాన్లు , కిటికీలు ఊగడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.
ఇకపోతే.. గత నెల 27న న్యాల్ కల్ మండలంలోని న్యాల్ కల్, ముంగి గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో వింత వింత శబ్ధాలు వచ్చినట్లు ప్రజలు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కానీ పది రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.