ముందస్తు ఎన్నికలు: ఫైళ్లతో మంత్రుల కుస్తీ.. ఉరుకులు, పరుగులు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాల్లోని పెండింగ్ పనులకు మంత్రులు వీలైనంత త్వరలో శంకుస్థాపన చేయాలని సీఎం ఆదేశించడంతో అమాత్యులంతా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాల్లోని పెండింగ్ పనులకు మంత్రులు వీలైనంత త్వరలో శంకుస్థాపన చేయాలని సీఎం ఆదేశించడంతో అమాత్యులంతా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అలాగే పెండింగ్ ఫైల్స్కు కూడా ఆమోద ముద్ర వేసేందుకు గాను... మంగళవారం రాత్రి ఫైళ్లతో కుస్తీలు పట్టారు. మొత్తానికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఇవాళే ఆఖరు రోజుగా ప్రచారం జరుగుతోంది.