అక్రమంగా బంగారం కొనుగోలు..శ్రీకృష్ణ జ్యూయెలర్స్ ఎండీ అరెస్ట్
హైదరాబాద్లోని ప్రముఖ ఆభరణాల సంస్థ శ్రీకృష్ణ జ్యూయెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్లోని ప్రముఖ ఆభరణాల సంస్థ శ్రీకృష్ణ జ్యూయెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేస్తున్న ఇతనిపై డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు.
ట్యాక్సులు ఎగ్గొట్టేందుకు విదేశాల నుంచి అక్రమ మార్గంలో ప్రదీప్ బంగారం కొనుగోలు చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. దీంతో ప్రదీప్ కుమార్తో పాటు అతని కుమారుడు సాయిచరణ్ను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రదీప్ అరెస్ట్ జంట నగరాల్లోని జ్యూవెలరీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.