Asianet News TeluguAsianet News Telugu

ఆ ఫోన్ కాల్ లేకపోయుంటే: ప్రియాంక నిందితుల గుట్టు విప్పింది అదే

శంషాబాద్‌ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో చిన్న ఫోల్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది. 

dr priyanka reddy murder case remand report
Author
Hyderabad, First Published Nov 30, 2019, 9:35 PM IST

శంషాబాద్‌ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో చిన్న ఫోల్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది. 8వ తేదీ సాయంత్రం 5.0 గంటలకు ప్రియాంక తన ఇంటి నుంచి బయలుదేరి, 6.08కి టోల్ ప్లాజా వద్దకు చేరుకుందన్నారు.

అక్కడే బండి పార్క్ చేస్తుండగా నలుగురు నిందితులు ఆమెను చూశారని... అదే సమయంలో ప్రియాంకపై అత్యాచారం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారని సజ్జనార్ వివరించారు. నవీన్ అనే వ్యక్తి స్కూటీ టైర్ గాలి తీస్తే ఆమె ఎక్కడికి వెళ్లలేదని మిగిలిన వారితో చెప్పి గాలి తీసేశాడని ఆయన వెల్లడించారు.

రాత్రి 9.23 గంటలకు టోల్‌ప్లాజా వద్దకు రాగానే ఆరిఫ్ ప్రియాంక దగ్గరకి వెళ్లి మేడమ్ మీ స్కూటీ పంక్చర్ అయ్యిందని, సాయం చేస్తానని చెప్పి నమ్మించాడని సీపీ తెలిపారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వారికి 9.28కి స్కూటీ ఇచ్చిందని.. శివ అనే వ్యక్తి స్కూటీని రీపేర్ చేయించుకోస్తానని వెళ్లాడన్నారు.

ఈ క్రమంలో ఆరిఫ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. వారిని నమ్మి స్కూటీని ఇచ్చిన ప్రియాంక.. 15 నిమిషాలు అయినప్పటికి వారు రాకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో ఆమె నిందితుల్లో ఒకరైన ఆరీఫ్‌కు ఫోన్ చేసింది.

ప్రియాంక కేసు దర్యాప్తులో భాగంగా కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసుకు ఆమె ఫోన్ నుంచి వెళ్లిన చివరి ఫోన్ కాల్ ఆరీఫ్‌కు వెళ్లిందని గుర్తించి అతనిని పట్టుకున్నారు. ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం డొంక కదిలింది. 

9.30కి అతను తిరిగి వచ్చి పంక్చర్ షాపు మూసివేశారని చెప్పి మరో చోటికి వెళ్లాడని... ఈ క్రమంలో నవీన్, చెన్నకేశవులు ప్రియాంకను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని సజ్జనార్ చెప్పారు.

అనంతరం నలుగురు కలిసి ఆమెపై అత్యాచారం చేశారని.. అదే సమయంలో ముక్కు, నోరు మూసేయడంతో ప్రియాంక ఊపిరాడక చనిపోయిందని ఆయన వెల్లడించారు. రాత్రి 10.28 గంటలకు ఆమె స్కూటీని అక్కడి నుంచి తీసుకెళ్లారని, 10.33కి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి లారీలో వేసుకుని వెళ్లిపోయారని సీపీ తెలిపారు.

మృతదేహాన్ని తగులబెట్టేందుకు నందిగామలో పెట్రోల్ బంక్‌కి వెళ్లారని, అక్కడ పెట్రోల్ దొరక్కపోయేసరికి వేరే చోట కొన్నారని ఆయన చెప్పారు. ప్రియాంక మృతదేహాన్ని చటాన్‌పల్లి అండర్ పాస్ కింద పెట్రోల్ పోసి తగులబెట్టారని సజ్జనార్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios