Asianet News TeluguAsianet News Telugu

ఎంజీఎంలో ఎలుకలు పట్టేందుకు బోన్ల ఏర్పాటు: నేడు వరంగల్‌కి డీఏంఈ

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకొనేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. శానిటేషన్ ను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టారు. శానిటేషన్ సరిగా లేని కారణంగానే ఎలుకలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. 
 

DME to visit Warangal MGM hospital  today
Author
Warangal, First Published Apr 1, 2022, 11:44 AM IST

వరంగల్: Warangal ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలను పట్టుకొనేందుకు బోన్లను ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే ఐసీయూలో ఏర్పాటు చేసిన బోనులో ఓ ఎలుక చిక్కింది. ఈ ఆసుపత్రిలోని ఇతర వార్డుల్లో కూడా బోన్లను ఏర్పాటు చేశారు.  ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అనే రోగి కాళ్లు , చేతులను ఎలుకలు కొరికిన విషయం తెలిసిందే.  ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.  ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. MGM సూపరింటెండ్ పై బదిలీ వేటేసింది.వరంగల్ ఎంజీఎం ఘటనలో సూపరింటెండ్ తో పాటు ఇద్దరు వైద్యులపై తెలంగాణ ప్రబుత్వం గురువారం నాడు సస్పెన్షన్ వేటు వేసింది.  గతంలో సూపరింటెండ్ గా పనిచేసిన Chandrasekhar ను వరంగల్ ఏంజీఎంకు  బదిలీ చేశారు. 

వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిలో  శానిటేషన్ పై కొత్త సూపరింటెండ్ కేంద్రీకరించారు. ఐసీయూ సహా ఆసుపత్రిలో ఉన్న ఎలుకల కోసం బోన్లు ఏర్పాటు చేశారు.  ICU లో చికిత్స పొందుతున్న కిడ్నీ రోగి Srinivas కు వైద్యుల బృందం చికిత్స అందిస్తుంది. శ్రీనివాస్ ను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించనున్నారు.

వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిని ఇవాళ DME సందర్వించనున్నారు.  అయితే Rats ఘటనపై సూపరింటెండ్ ను బదిలీ చేయడంపై కొందరు వైద్యులు, సిబ్బంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డీఎంఈ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని భావిస్తున్నారు.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి శ్రీనివాస్ ను ఎలుకలు కొరికిన ఘటనపై వైద్యులు, సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వైద్యులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా నిర్లక్ష్యం ఈ ఘటనలో కన్పిస్తుందని రోగి బంధువులు విమర్శిస్తున్నారు. ఎలుకలు కొరికి గాయాలైన చోట కనీసం చికిత్స చేయకపోవడంపై కూడా రోగి బంధువుల  మండి పడుతున్నారు. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో వైద్యులలో చలనం వచ్చిందన్నారు.

గురువారం నాడు అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ వరంగల్ ఏంజీఎంను పరిశీలించారు. శానిటేషన్  నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటేషన్ ను మెరుగుపర్చాలని  ఆదేశించారు.

కిడ్నీ రోగి శ్రీనివాస్ ను ఐసీయూలో  ఎలుకలు కొరికిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది.ఈ విషయమై విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకొంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హరీష్ రావు ప్రకటన వెలువడిన నాలుగు గంటల్లోపుగానే సూపరింటెండ్ సహా ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటేసింది. 

వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిలో  ఎలుకలు కొరికిన రోగి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఎంజీఎం సూపరింటెండ్ గా చంద్రశేఖర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. 9 బ్లాకులుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణను సరిగా చేయాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశంచారు సూపరింటెండ్. 

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒకరోజు పసికందును కుక్కలు కరిచి చంపాయి. ఈ ఘటన 2011 జనవరి 12న చోటు చేసుకొంది. ఈ ఘటన తర్వాత  2018లో మృత శిశువును ఎలుకలు కొరికిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios