దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంలో విచారణ: ఢిల్లీకి సజ్జనార్
దిశ నిందితుల ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో బుధవారం నాడు విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై విచారణను పురస్కరించుకొని సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు సుప్రీంకోర్టుకు హాజరుకానున్నారు.
Also read:దిశ నిందితుల ఎన్కౌంటర్పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు
సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్కౌంటర్పై దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం నాడు జరగనుంది. దిశ నిందితుల ఎన్కౌంటర్పై రెండు పిటిషన్లు, పోలీసులపై మరో పిటిషన్ దాఖలైంది.
ఈ మూడు పిటిషన్లపై విచారణ బుధవారం నాడు ఉదయమే జరగనుంది. దీంతో ఈ కేసు విషయంలో ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ సుప్రీంకోర్టుకు ఇవ్వనున్నారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి ఇప్పటికే సేకరించిన ఆధారాలను పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇచ్చారు. బుధవారం నాడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ సాగనుంది. గురువారం నాడు తెలంగాణ హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ జరగనుంది.
దిశపై గ్యాంగ్ రేప్, హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 6వ తేదీన దిశపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నిందితులను చటాన్పల్లి వద్ద పోలీసులు ఎన్కౌంటర్లో హత్య చేసిన విషయం తెలిసిందే.