చేరాలనిపిస్తోంది: కేటీఆర్ రైలుబండి బడికి దేవిశ్రీ ప్రసాద్ ఫిదా
సిరిసిల్ల జిల్లాలో రైలు బడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ స్కూల్ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫిదా అయ్యారు.
హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలో రైలు బడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ స్కూల్ కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఫిదా అయ్యారు.
ఆ పాఠశాల ఫొటోలను తెలంగాణ మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెటిజన్లతో పాటు ప్రముఖులు కూడా ఆ పాఠశాలపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా దానిపై స్పందించారు.
అద్భుతంగా ఉన్నాయి కేటీఆర్ బ్రదర్.. ఇలాంటి స్కూల్కు వెళ్లకుండా ఏ విద్యార్థి ఉంటాడంటూ ట్వీట్ చేశారు. ఆ స్కూల్లో చేరాలనిపిస్తోందని తన కోరికను ఆయన వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి రైలుబోగీల రూపంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ తో ఈ స్కూల్ రూపుదిద్దారు.
Wowwwwww Thats amazing Dear Brother @KTRTRS !!! Inspiring !! 😁👏🏻👏🏻👏🏻
— DEVI SRI PRASAD (@ThisIsDSP) July 29, 2018
No Kid wud like to Bunk this school !!!
Even I feel like joining here now ! 😁🎵👏🏻 https://t.co/Hcs7MVcox5