క్రికెట్ బెట్టింగ్... విద్యార్థి ఆత్మహత్య
బోరబండకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ... అప్పులపాలయ్యాడు. కాగా... రూ.40వేలు అప్పు ను రవి కుమార్ తండ్రి తీర్చేశాడు. ఇంకా అప్పు తీర్చాల్సి ఉంది. కాగా... వాటిని వెంటనే తీర్చాలంటూ బుకీ రాజశేఖర్ అతనిని బెదిరించడం మొదలుపెట్టాడు.
క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. క్రికెట్ బెట్టింగ్ లో అప్పులపాలై వాటిని ఎలా తీర్చాలో తెలియక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
బోరబండకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ... అప్పులపాలయ్యాడు. కాగా... రూ.40వేలు అప్పు ను రవి కుమార్ తండ్రి తీర్చేశాడు. ఇంకా అప్పు తీర్చాల్సి ఉంది. కాగా... వాటిని వెంటనే తీర్చాలంటూ బుకీ రాజశేఖర్ అతనిని బెదిరించడం మొదలుపెట్టాడు.
ఆ బెదిరింపులకు రాజశేఖర్ బయపడిపోయాడు. డబ్బులు ఎలా తార్చాలో తెలియక.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోవడంతో అతని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. క్రికెట్ బెట్టింగే తన కొడుకు ప్రాణాలు తీసిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.