Asianet News TeluguAsianet News Telugu

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు కలకలం..

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. 

crude bombs bombs found near husnabad bus stand in siddipet district
Author
First Published Nov 22, 2022, 1:41 PM IST

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబులు పేలడం కలకలం సృష్టించింది. బస్టాండ్‌కు సమీపంలోని పార్కింగ్ స్థలంలో బాంబు పేలుడు శబ్దం వచ్చింది. దీనిపై ఆర్టీసీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అయితే బస్టాండ్‌ సమీపంలో ఐదు నాటు బాంబులను పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

అక్కడికి నాటు బాంబులు ఎవరూ తీసుకొచ్చారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios