హైద్రాబాద్  లోని  ఆర్ బీ ఐ కార్యాలయం ముందు  సీపీఐ శ్రేణులు ఇవాళ ఆందోళన నిర్వహించాయి.  అదానీ  కంపెనీల  వ్యవహరంపై   విచారణకు డిమాండ్  చేస్తూ సీపీఐ శ్రేణులు  నిరసనకు దిగాయి.

హైదరాబాద్: నగరంలోని ఆర్ బీ ఐ కార్యాలయం ముందు సోమవారం నాడు సీపీఐ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అదానీ వ్యవహరంపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ శ్రేణులు ఆందోళనకు దిగారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహ ఆ పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అదానీ కంపెనీలపై హిడెన్ బర్గ్ నివేదిక విషయమై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ విషయమై పార్లమెంట్ ఉభయ సభలను విపక్షాలు స్ధంభింపజేస్తున్నాయి.