Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునసాగర్ బైపోల్: టీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయం తీసుకొన్నాయి.
 

CPI and CPM decides to support TRS candidate Nomula Bhagath lns
Author
Hyderabad, First Published Apr 12, 2021, 8:42 PM IST

హైదరాబాద్:నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయం తీసుకొన్నాయి.ఈ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 17వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.

also read:దుబ్బాక ఫలితం రీపీటయ్యేనా?: టీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు బీజేపీ చెక్ పెట్టేనా?

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి పోటీ చేస్తున్నారు.  టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్య ర్ధిగా డాక్టర్ రవికుమార్ బరిలో నిలిచారు.కాంగ్రెస్ పార్టీ లేఖ రాసినా కూడ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.

ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ఈ తరుణంలో సీపీఐ, సీపీఎంలు  నోముల భగత్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios