Asianet News TeluguAsianet News Telugu

షబ్బీర్‌ అలీపై దాడి కేసు: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై  కోర్టు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

Court issues Non bailble Warrant against MIM chief Asaduddin Owaisi lns
Author
Hyderabad, First Published Jan 25, 2021, 2:11 PM IST

హైదరాబాద్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై  కోర్టు సోమవారం నాడు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.2016లో టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్, ఆ పార్టీ నేత షబ్బీర్ అలీలు ప్రయాణీస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకొన్నారు. కారులో ప్రయాణీస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఈ విషయమై అప్పట్లో కాంగ్రెస్ నేతలు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ కారుపై ఎంఐఎం నేతలు దాడికి దిగారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అసద్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

అయితే ఈ దాడిలో తన పాత్ర లేదని గతంలోనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.  దాడికి పాల్పడుతున్నవారిని తాను అడ్డుకొన్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios