శిల్పా చౌదరికి మరో మూడు రోజుల పోలీస్ కస్టడీ
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను రూ.కోట్లలో మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరిని న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీస్ కస్టడికి అనుమతించింది. రెండు రోజుల్లో ఈ మేరకు ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నారు.
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను రూ.కోట్లలో మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరిని న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీస్ కస్టడికి అనుమతించింది. రెండు రోజుల్లో ఈ మేరకు ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 13 వరకు శిల్పా చౌదరిని కస్టడీకి అనుమతించింది కోర్ట్. కాగా.. గతంలో రెండు రోజుల విచారణ సందర్భంగా శిల్పా చౌదరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు పోలీసులు. శిల్ప కేసులో తమను మోసం చేసిందని ఇప్పటికే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేయడానికి పలువురు ప్రముఖులు వెనుకాడుతున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి..స్టేట్మెంట్ సమర్పించారు పోలీసులు. అనంతరం శిల్పా చౌదరిని చంచల్గూడ మహిళా జైలుకు (chanchalguda womens jail) తరలించారు. తన స్థాయిని పెంచుకునేందుకు శిల్ప రకరకాలుగా ప్రయత్నాలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. బిల్డప్ కోసం… స్టేటస్ సింబల్గా బౌన్సర్లను నియమించుకున్నట్టు ఆమె చెప్పింది.
Also Read:శిల్పా చౌదరి కేసు : కేసులో ట్విస్ట్.. విచారణకు రాధికారెడ్డి డుమ్మా.. నోటీసులివ్వనున్న పోలీసులు..!
అంతేకాదు ఆమె రెండేళ్లు అమెరికాలో (america) ఉండి వచ్చినట్లు తేలింది. అయితే.. శిల్పా చౌదరి ఎందుకు అమెరికా వెళ్లారు.. ఎవరెవరు వెళ్లారు.. అక్కడ కూడా డీలింగ్స్ చేశారా.. అనే కోణంలోను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘరానామోసం కేసులో రాధికారెడ్డి (radhika reddy) పేరు తెరపైకి రావడం పెద్ద దుమారం రేపుతోంది. ఆమె ఏకంగా పది రూపాయల వడ్డీకి కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు తేలింది. ఆ డబ్బంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ మీదే పెట్టారా.. ఇతర రూపాల్లో మళ్లించారా.. అన్నది లెక్క తేలాల్సి ఉంది. అయితే రాధికా రెడ్డి మాత్రం పోలీసుల విచారణకు రాలేదు.