పెళ్లిళ్ల పేరుతో మ్యాట్రిమోని సంస్థను ఏర్పాటు చేసి డబ్బులు వసూలు మోసాలకు పాల్పడుతున్న దంపతులను శంకర్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్ పల్లికి చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు  మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

శంకర్‌పల్లి:పెళ్లి పేరుతో మూడు నెలల్లో 300 మోసాలకు పాల్పడిన ఓ Matrimony సంస్థకు చెందిన దంపతులను shankarpallyపోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ , జిల్లాల్లో ఈ దంపతులు మ్యాట్రిమోని కేంద్రాలను నడుపుతున్నారు., వరంగల్ లో ఒకటి, ఆదిలాబాద్ లో 3, నిజామాబాద్ 2 లో మ్యాట్రిమోని కేంద్రాలను ను నడిపిస్తున్నారు. మూడు నెలల క్రితం శంకర్ పల్లికి చెందిన ఓ వ్యక్తి రూ. 3 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాడు.

also read:IndusViva Pyramid Scheme : 10 లక్షల మందిని ముంచి.. వందల కోట్లతో జంప్, పోలీసులకు చిక్కిన ఛైర్మన్

అయితే ఈ సంస్థ నుండి ఆ వ్యక్తికి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తాను మోసపోయినట్టుగా భావించిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకర్ పల్లి పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేశారు. శంకర్ పల్లి పోలీసులకు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సహాయం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈ మ్యాట్రిమోని పేరుతో దంపతులు మోసం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోని సంస్థ మేనేజర్లుగా వ్యవహరిస్తున్న Swetha, Hemanth దంపతులను అరెస్ట్ చేశారు. మూడు మాసాల్లో సుమారు 300 మందిని మోసం చేసినట్టుగా దంపతులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. బాధితుల నుండి సుమారు 9.8 లక్షలను వసూలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో నిందితులు ఒప్పుకొన్నారు. తాము ఈ సంస్థలో పనిచేస్తున్నామని వారు