Asianet News TeluguAsianet News Telugu

రేపటి నుండే తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్... ఆ రెండు జిల్లాల్లోనే

డ్రై రన్ సన్నాహక చర్యల్లో భాగంగా వాక్సినేషన్ కు అవసరమైన ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని ఇప్పటికే గుర్తించి ఆ జాబితాను Co WIN యాప్లో అప్లోడ్ చేశారు. 

Corona Vaccine Dry Run In telangana
Author
Hyderabad, First Published Jan 1, 2021, 8:43 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుండి(శనివారం) రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కరోనా టీకా డ్రై రన్‌ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ఆదేశాలతో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

డ్రై రన్ సన్నాహక చర్యల్లో భాగంగా వాక్సినేషన్ కు అవసరమైన ఆరోగ్య కార్యకర్తల బృందాన్ని ఇప్పటికే గుర్తించి ఆ జాబితాను Co WIN యాప్లో అప్లోడ్ చేశారు. అలాగే వ్యాక్సినేషన్ లబ్దిదారుల జాబితాలను కూడా రూపొందించి Co-WIN యాప్లో అప్ లోడ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిస్థితులు(AEFI) ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే AEFI- చికిత్సా కేంద్రాల జాబితాను రూపొందించారు.  

మూడు విడతలుగా ఈ డ్రై రన్ నిర్వహించనున్నారు. దాదాపు 100మందిని ఈ డ్రైవ్ రన్ లో భాగస్వామ్యం చేస్తున్నారు. వీరిలో డాక్టర్లతో పాటు సాధారణ పౌరులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇరు జిల్లాల కలెక్టర్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి ఈ డ్రై రన్ ప్రక్రియ కొనసాగనుంది.

ఇక ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో డ్రై రన్ నిర్వహించారు. ఈ జిల్లాలో ఎంపికచేసిన ప్రాంతాల్లో ఈ కరోనా వ్యాక్సిన్ అందించారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్తి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పూర్ణా హార్ట్ ఇన్సిట్యూట్ (ప్రైవేట్ వైద్య కేంద్రం) సూర్యారావు పేట, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం, పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్ నగర్ యుపిహెచ్‌సి లో ఈ వ్యాక్సిన్ ను అందించారు.

గతేడాది డిసెంబర్ 28వ తేదీన నిర్వహించిన డ్రైరన్ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరించి కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర, స్థాయి టాస్స్ ఫోర్స్ లకు అందచేయటం వంటి చర్యలున్నాయి. వాక్సినేషన్ అధికారులుగా సంబధిత సచివాలయంలోని 1) మహిళ పోలీస్ 2)డిజిటల్ అసిస్టెంట్ 3) A.N.M. 4) అంగన్వాడి వర్కర్ మరియు 5) ఆశా వర్కర్ లను నియమించడం జరిగింది.

జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ ఈ ప్రక్రియనంతా సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సమాచారాన్ని అందించనుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios