Asianet News TeluguAsianet News Telugu

వంగూరులో ఓటు వేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

congress working president revanthreddy casting his vote
Author
Kondareddypally, First Published Dec 7, 2018, 8:03 AM IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల కీలక నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన  నాగర్ కర్నూల్ జిల్లా
వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

ఓటింగ్ సరళిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని చోట్లు ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు మెురాయించడంపై ఆయన కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతాన్ని పెంచాలని రేవంత్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios