తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్న ‘‘రైతు సంఘర్షణ సభ’’లో రాహుల్ ప్రసంగిస్తారు.  

తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో ఆయన ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం 7 గంటలకు రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్ ప్రకటించనున్నారు రాహుల్. రైతులు, యువతే లక్ష్యంగా రాహుల్ వరంగల్ టూర్ చేపట్టారు. ఈ కార్యక్ర‌మం అనంత‌రం రాత్రి 8:00 గంటలకు వరంగల్ నుండి రోడ్ మార్గం ద్వారా బయలుదేరి రాత్రి 10:40 గంట‌ల వ‌ర‌కు హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్ తాజ్ కృష్ణ హోటల్ లో బస చేస్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శనివారం నాడు మధ్యాహ్నం 12:30కి హోటల్ తాజ్ కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కు కు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10 మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్య కు నివాళులు అర్పిస్తారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45నుంచి 2:45వరకు గాంధీ భవన్ లో పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారు. 2:45 నుంచి 2:50వరకు మెంబర్ షిప్ కో ఆర్డినేతలతో ఫోటోలు దిగుతారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం 3 గంటలకు గాంధీ భవన్ నుంచి రోడ్ మార్గంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5:50 కి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. 

ఇకపోతే.. 2023 ఎన్నికల్లో Telanganaలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు రైతు సమస్యలపై తీసుకొని ఇవాళ వరంగల్ లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభ విజయవంతం చేసి ప్రత్యర్ధులకు సవాల్ విసరాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. ఈ సభకు జన సమీకరణను కూడా పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సన్నాహాలు చేసుకొంటుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాకర్తగా Sunilను ఆ పార్టీ నియమించుకుంది. సునీల్ ఇచ్చిన సూచనలు, సలహాలతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అడుగులు వేస్తుంది. వరంగల్ సభలో కూడా సునీల్ కూడా ఈ సభకు వచ్చారు. ఈ సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా సునీల్ పార్టీ నేతలతో చర్చించారు.