Asianet News TeluguAsianet News Telugu

ఔరంగజేబును తలపిస్తున్న కేసీఆర్.. గాలి పీల్చినా పన్నే!.. భట్టి విక్రమార్క

ఎల్.ఆర్.ఎస్. పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను కూడా పీక్కుతింటోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ పన్నులు రద్దు చేస్తామని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు.  కేసీఆర్ ఔరంగజేబులా ప్రజలపై పన్నులు విధిస్తూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. 

congress leader mallu bhatti vikramarka fires on kcr about LRS - bsb
Author
Hyderabad, First Published Oct 5, 2020, 5:29 PM IST

ఎల్.ఆర్.ఎస్. పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను కూడా పీక్కుతింటోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ పన్నులు రద్దు చేస్తామని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు.  కేసీఆర్ ఔరంగజేబులా ప్రజలపై పన్నులు విధిస్తూ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని నిప్పులు చెరిగారు. 

సోమవారం నాడు ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డితో కలసి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద  మీడియాతో మాట్లాడారు.  అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. మరో రెండున్నర సంవత్సరాల తరువాత కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం తథ్యమని భట్టి చెప్పారు. పన్నుల పేరుతో రాష్ట్ర ప్రజల మీద భారం మోసి ఖజానా నింపుకుంటున్నాడని కేసీఆర్ మీద మండిపడ్డారు. 

పేద, మధ్య తరగతి కుటుంబాలవారు బిడ్డల పెళ్లికోసం, పిల్లల చదువుకోసం, భవిష్యత్తుకోసం రూపాయిరూపాయి కూడబెట్టి.. స్థలాన్ని కొనుక్కుంటే..  ఇప్పుడు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఎల్.ఆర్.ఎస్. పేరుతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని విమర్శించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న ఎల్.ఆర్.ఎస్. స్కీమ్ హేతుబద్ధంగా లేదని తాము మొదటినుండీ చెబుతున్నామన్నారు.  ప్రజల ఆస్తులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి.. కానీ అందులో వాటాలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని భట్టి నిప్పులు ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. రిజిస్ట్రేషన్ కు ఎల్.ఆర్.ఎస్ కు లింక్ చేయడం దేశంలో ఎక్కడా లేదని బట్టి అన్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు ఎవరికీ లేదని భట్టి చెప్పారు. 

ఎల్.ఆర్.ఎస్ కు ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అప్పుడు దీనిని రద్దు చేస్తామని భట్టి చెప్పారు. అలాగే..  ఇంటి విస్తీర్ణం, ఇతర వివరాలు, పొలాల్లో వేసుకున్న కొట్టాలు విస్తీర్ణం, ట్రాక్టర్లు పెట్టుకోవడానికి వేసుకున్న షెడ్ల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోందని వీటన్నంటిని తమ వద్ద పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇబ్బడిముబ్బడిగా తీసుకువచ్చిన అప్పుల భారాన్ని తీర్చేందుకు ఇప్పుడు ప్రజలను పీక్కుతింటున్నారని అన్నారు. మొత్తం రూ. 6 లక్షల కోట్లకు చేరనున్న తెలంగాణ అప్పులు, వడ్డీలు కట్టుకునేందుకు రేప్పొద్దున గాలి పీల్చినా, నీళ్లు తాగినా, గడ్డం పెంచినా, గడ్డం గీసుకున్నా, రోడ్డు మీద మనిషి నడిచినా, ఆఖరుకు స్నానం చేసినా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల మీద పన్నులేస్తుందని అన్నారు. గతంలో అప్పుడెప్పుడో ఔరంగజేబు వేసిన జుట్టు పన్నులాంటివి అన్నింటినీ వేస్తారని భట్టి చెప్పారు. 

నిజాం రాజును గుర్తుకు తెచ్చేలా కూడా కేసీఆర్ పన్నులు వేస్తారని భట్టి చెప్పారు. నిజాం ప్రభుత్వంలో పండించిన పంటకన్నా.. పన్నులు అధికంగా వేసేవారు.. వాటిని కట్టలేక.. ప్రజలు భూములను ప్రభుత్వానికి అప్పజెప్పితే.. అంతకు ముందు కట్టాల్సిన పన్ను బాకీ తీర్చేందుకు ప్రజల్ని వెట్టి చాకిరి చేయించారు. రేపు భవిష్యత్ లో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజల్ని వెట్టి చాకిరిక నెట్టేలా చేస్తున్నారని తీవ్రమైన ఆగ్రహంతో చెప్పారు. కేసీఆర్ ది ఫ్యూడల మనస్తత్వమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios