అఫిడవిట్ ఇస్తేనే బీ- ఫారం: టీపీసీసీ నిర్ణయం
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.
హైదరాబాద్: స్థానిక పరిస్థితులకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే ఎంపిక చేసి వారికి బీ - ఫారాలను అందించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను డీసీసీలకు అప్పగించింది.
రాష్ట్రంలోని 32 డీసీసీ అధ్యక్షులతో టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్ ఏ- ఫారాలను అందించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బీ-ఫారం తీసుకొనే సమయంలో రూ. 20 స్టాంపు పేపర్పై అఫిడవిట్ను తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్ సూచించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోమని, పార్టీ విప్, ఆదేశాలను ధిక్కరించబోమని పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ అఫిడవిట్ సమర్సిస్తేనే బీ-ఫారాన్ని అభ్యర్థులకు అందించనున్నారు.
గెలుపు గుర్రాలకే టిక్కెట్లను కేటాయించాలని ఉత్తమ్ డీసీసీ అధ్యక్షులకు సూచించారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలతో పాటు గెలుపు అవకాశాలను కూడ పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. అభ్యర్థుల ఎంపికలో వివాదాలను స్థానికంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.