kavitha Vs Revant: టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. 

kavitha Vs Revant: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 119 స్థానాలకు గాను 115 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. తన ప్రత్యర్థి పార్టీలకు గులాబీ పార్టీ షాక్ ఇచ్చింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా వ్యూహరచనలలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులేస్తోంది. ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. అధికార పార్టీలోని అసమ్మతి నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది. 

ఈ తరుణంలో బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం అనుగ్రహం కోల్పోయిన అసమ్మతి నేత తుమ్మల నాగేశ్వరరావు తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పెద్దలు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఈ పర్యటనపై అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతుంటే. మరోవైపు ఈ విషయమై.. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. 

తొలుత బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముందు ఎమ్మెల్సీ కవిత ట్విట్ చేస్తూ. "అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు.. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం.. ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం.." అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన ఫోటోను పోస్ట్ చేశారు. 

Scroll to load tweet…

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ట్విట్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్లో ఇలా రాస్కొచ్చారు. "గల్లీలలో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వీడ్కోలు.. ఇది కేసీఆర్ మ్యాజిక్. జగమెరిగిన నిక్కర్.. లిక్కర్.. లాజిక్కు.. " అంటూ ప్రధాని మోడీ, కెసిఆర్ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇలా కవిత, రేవంత్ రెడ్డి ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది.


Scroll to load tweet…