Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. GO 317 సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ !  

GO 317 : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో 317 పై తలెత్తినటువంటి ఉద్యోగుల అభ్యంతరాలు, వివాదాలన్నింటిని కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఓ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడింది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చైర్మన్ గా, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కమిటీల సభ్యులుగా ఓ సబ్ కమిటీ ఏర్పాటు అయింది. 

CM Revanth for Forming Sub-Committee to Resolve GO 317 Issue KRJ
Author
First Published Feb 25, 2024, 3:42 AM IST

GO 317 : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 317 సమస్యలను పరిష్కరించి, సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది . ఈ కమిటీలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్‌గా ఉండగా, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు.  రాష్ట్ర జిఏడి ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ జీవో 317  సంబంధించిన అన్ని అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించి ప్రభుత్వానికి  సిఫార్సులు చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంతకీ GO 317 అంటే..? 

2021లో కేసీఆర్ ప్రభుత్వం GO 317 ను తీసుకవచ్చింది. ఈ జీవో ప్రకారం .. ఉమ్మడి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను.. నూతనంగా ఏర్పాటు చేసిన 33 జిల్లాలకు అనుగుణంగా విభజించింది. ఇలా చేయడం వల్ల పలు శాఖలోని ఉద్యోగులు బదిలీ కావాల్సి వచ్చింది.  ఈ జీవో అములుతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందనీ చాలా మంది ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

సమస్యాత్మక 37 జీవోను సమీక్షించి, తమ ఇబ్బందులను పరిష్కరించాలని బాధ్యత ఉద్యోగులకు కోరుతున్నారు. తాము తమ కుటుంబాలకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనేకమంది ఉద్యోగులను అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. జీవో 370ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో హామీ ఇవ్వడంతో పాటు ప్రచారంలో కూడా పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తవించింది. 

ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం దీనిపైన ముందుగా  క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  సమస్య కారణమేంటి?  సమస్య ఎందుకు తలెత్తింది?  దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు? ఉద్యోగులను మార్చాల్సి వస్తే.. ఏ విధంగా చేయాలి? ఇవన్నీ కూడా అధ్యయనం చేసి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది.  ఈ సమస్యపై వీలైనంత త్వరగా నివేదిక ఇస్తే.. ఆ  సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి.. క్యాబినెట్ సబ్ కమిటీ జీవో 317 పై అధ్యయనం చేసి నివేదిక ఇస్తే.. అతి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios