Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ : వారం క్రితం అదృశ్యం.. చివరికి క్వారీ గుంతలో శవమై తేలిన బాలుడు

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన ఉస్మాన్ అనే బాలుడు తిరుమలగిరిలోని ఓ క్వారీలో శవమై తేలాడు. అయితే చిన్నారి మరణంపై తల్లీదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 

child boy dead body found in thirumalagiri
Author
First Published Dec 4, 2022, 8:05 PM IST

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఉస్మాన్ అనే బాలుడు గత నెల 28 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో ఆదివారం తిరుమలగిరిలోని క్వారీ గుంతలో శవమై తేలాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉస్మాన్ మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios