కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్
రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ భౌతికకాయాన్ని పరామర్శించేందుకు ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ భౌతికకాయాన్ని పరామర్శించేందుకు ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఏడుస్తున్న ఎన్టీఆర్, కల్యాణ్రామ్ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ కూడా అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో నార్కెట్పల్లి చేరుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడిన ఏపీ సీఎం హరికృష్ణకు అందించిన చికిత్సను అడిగి తెలుసుకున్నారు. హరికృష్ణ ఆకస్మిక మరణం కారణంగా ఇవాళ్టీ తన అధికారిక కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.
బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?
హరికృష్ణ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో హరిక్రిష్ణ దుర్మరణం (ఫోటోలు)
కామినేని ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్, కల్యాణ్రామ్