ఖమ్మంలో ఆకతాయిలు బరితెగించారు. భర్త, సోదరుడితో వెడుతున్న వివాహితను అటకాయించి.. అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను తమకు వదిలేసి పొమ్మంటూ వారిని బెదిరించారు. నిందితుల్లో మైనర్లు కూడా ఉన్నారు.
ఖమ్మం : khammam జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన married womanను వెంబడించి Obscenityగా ప్రవర్తించిన సంఘటనలో ఏడుగురి మీద శుక్రవారం case నమోదయ్యింది. హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లేందుకు భర్త, 14 నెలల కుమారుడితో కలిసి ఆమె ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున బస్సు దిగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోదరుడితో కలిసి ద్విచక్రవాహనం మీద ఇంటికి వెడుతుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించారు.
బాధితురాలి మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను వదిలేసి వెళ్లాలంటూ సోదరుడు, భర్తను బెదిరించారు. వారినుంచి తప్పించుకుని స్వగ్రామానికి వెళ్లిన వెంటనే గ్రామస్తుల సహకారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నగరంలోని ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన ఏడుగురిని (వీరిలో ముగ్గురు మైనర్లు)తో పాటు మరికొందరి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఈ ఘటన మీద పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆగ్రమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. కోర్టు శిక్షలు అనుభవిస్తున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా నైరుతి ఢిల్లీలోని ద్వారకాలో ఒక హోటల్ లో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ జూన్ 3న పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తనకు డేటింగ్ యాప్ లో కలిశాడని మే 30న అతనితో కలిసి హోటల్ కి వెళ్లగా అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన ఫోన్ కాల్స్ కు ఆన్సర్ చేయడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వివరించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని… పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ద్వారకా డీసీపీ ఎం. హర్షవర్ధన్ వెల్లడించారు.
amnesia pub case: గోళ్లతో రక్కుతూ .. బాలికకు నరకం చూపిన నిందితులు, పోలీసుల విచారణలో వెలుగులోకి
కాగా, మే 30న నైరుతి ఢిల్లీలోని ద్వారకలోని ఓ లగ్జరీ హోటల్లో 28 ఏళ్ల యువతికి మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన నిందితుడిని వెతికి పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందం హైదరాబాద్లో క్యాంప్ చేస్తోంది. హైదరాబాద్కు చెందిన అనుమానితుడిని డేటింగ్ వెబ్సైట్లో మహిళ కలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జూన్ 3న మహిళ ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) హర్షవర్ధన్ మండవ తెలిపారు.
28 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో మోహక్ గుప్తా అనే వ్యక్తిని డేటింగ్ యాప్లో కలిశానని, ఆ తరువాత ఇద్దరూ స్నేహితులుగా మారారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఇద్దరూ తమ కాంటాక్ట్ నంబర్లు మార్చుకుని చాటింగ్ మొదలుపెట్టారు. అలా, మే 30న గుప్తా ఢిల్లీకి వచ్చి తనను కలవాలని మహిళను కోరాడు. వారు ద్వారకలోని ఒక హోటల్లో కలుసుకున్నారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం అందించాడు. దీంతో పానీయం తాగగానే స్పృహ తప్పి పడిపోయానని, ఆ తరువాత హోటల్ గదిలో ఆ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది. మరుసటి రోజు, ఆ వ్యక్తి ఆమెను మెట్రో స్టేషన్ బయట దింపాడని, మహిళ ఫిర్యాదును ఉటంకిస్తూ ఒక పోలీసు అధికారి తెలిపారు.
“ఆ తర్వాత గుప్తా ఆమె కాల్లకు సమాధానం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ పోలీసులకుఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 328 (నేరం చేసే ఉద్దేశ్యంతో విషం మొదలైన వాటి ద్వారా గాయపరచడం), 376 (రేప్) కింద కేసు నమోదు చేశాం. నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తి. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి' అని అధికారి తెలిపారు.
