Asianet News TeluguAsianet News Telugu

హన్మకొండలో కారు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..

అన్నాదమ్ముల కుటుంబాలు వేములవాడ దైవదర్శనానికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ అతి వేగంగా వచ్చి కొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకుల కుప్పగా మారిపోయింది. 

Car accident in Hanmakonda.. Four of the same family died, three are in critical condition - bsb
Author
First Published Dec 22, 2023, 7:19 AM IST

హన్మకొండ : తెలంగాణలోని హన్మకొండలో శుక్రవారం తెల్లవారుజామున షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం శాంతినగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు ఇసుక లారీ  ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన గురించి తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని ఎంజిఎంకి తరలించారు. 

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వేములవాడ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. అన్నాదమ్ముల కుటుంబాలు వేములవాడ దైవదర్శనానికి వెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ అతి వేగంగా వచ్చి కొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకుల కుప్పగా మారిపోయింది.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios