Asianet News TeluguAsianet News Telugu

ఈటలవే హత్యా రాజకీయాలు .. ఎంపీటీసీని చంపిందెవరు , ఇప్పుడు నన్ను కూడా : రాజేందర్ దంపతులకు కౌశిక్ రెడ్డి కౌంటర్

ఈటల రాజేందర్ కే హత్యా రాజకీయాలు చేసే అలవాటుందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. తాను ఆయనను చంపడం కాదని.. ఈటలే తనను హత్య చేయిస్తారని భయంగా వుందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
 

brs mlc kaushik reddy counter to bjp mla etela rajender couple ksp
Author
First Published Jun 27, 2023, 5:34 PM IST

బీజేపీ నేత ఈటల రాజేందర్, ఆయన సతీమణి ఈటల జమున చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. ఈటలకే హత్యా రాజకీయాలు చేసే అలవాటుందని.. ఉద్యమం సమయంలో ఆయన ఎంతోమందని వేధించారని రాజేందర్ ఆరోపించారు. 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆయనను చంపడం కాదని.. ఈటలే తనను హత్య చేయిస్తారని భయంగా వుందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు తనను చంపేందుకు కుట్ర చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రూ.20 కోట్లిచ్చి చంపిస్తానని అంటున్నారని.. ఇంతకంటే పెద్ద జోక్ లేదంటూ కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. జమున కూడా ఈటల డైరెక్షన్‌లోనే మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. హుజారాబాద్ అభివృద్ధిపై తాను ఈటలతో చర్చకు సిద్ధమని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హుజురాబాద్‌లో అమరవీరుల స్థూపాన్ని తాను కూల్చివేసినట్లుగా ఈటల దంపతులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ALso Read: ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్ర.. : జమున సంచలన ఆరోపణ

రోడ్డు విస్తరణలో భాగంగా పురపాలక సంఘం అధికారులే దానిని తొలగించారని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆ స్థూపంపై ఈటల పేరు లేదని.. అసలక్కడ ఎలాంటి శిలాఫలకం లేదని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో అసలు రాజేందర్ ఎక్కడున్నారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలవాలనే 2004లో ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios