Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy: 83 వేల మంది రైతుల చావుల‌కు కార‌ణం.. కేసీఆర్ స‌ర్కారుపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Telangana Congress president Revanth Reddy: ప్రజలు నిర్ణయిస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) భూస్వామ్య పాలనను కూలదోస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఇప్పటికే నిర్ణయించామనీ, కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందనీ, కొత్త ప్రభుత్వం మొదటి నెల నుంచే ఆరు హామీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
 

BRS govt let 83,000 farmers die, Congress Revanth Reddy's comments on KCR govt, Telangana Elections RMA
Author
First Published Nov 22, 2023, 5:18 PM IST

Telangana Assembly Elections 2023: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యుల ఫాంహౌస్ లు తెలంగాణ వనరులను కొల్లగొడుతున్నాయనీ, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అదే బాటలో నడుచుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల వద్ద ఉన్న రాష్ట్ర వనరులను హరించారని పేర్కొన్నారు. వనపర్తి, అచ్చంపేటలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్ తనను తాను ప్రశ్నించుకోవాలనీ, తాను చదువుకున్న పాఠశాల, కళాశాల, తాను ప్రయాణించిన రోడ్డు అన్నీ కాంగ్రెస్ నిర్మించినవేననీ, వ్యవసాయ పొలాలకు నీరందించిన సాగునీటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయనే సమాధానం దొరుకుతుందన్నారు.

తన భూస్వామ్య మనస్తత్వంతో అవమానానికి గురై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు భయాందోళనకు గురవుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంపడం తప్ప కేసీఆర్ చేసిందేమిటని ప్రశ్నించారు. వందలాది ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించడంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బాస్ ను అనుసరించారని విమర్శించారు. రాజకీయాల్లోకి రాకముందు నిరంజన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అని ప్ర‌శ్నించారు. తాను చదువుకున్నందున వనపర్తికి ప్రత్యేక స్థానం ఉందనీ, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సురవరం ప్రతాపరెడ్డి వంటి మహానుభావులను గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా పలు పర్యాయాలు పనిచేసిన కాలంలో గౌరవం తప్ప మరేమీ సంపాదించని జి.చిన్నారెడ్డి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించార‌ని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు.

83 వేల మంది రైతులకు రైతుబీమా అందిందని వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా చెప్పారని, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 83 వేల మంది రైతులను చావడానికి అనుమతించిందన్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉండి ఉంటే వారు బతికి ఉండేవారని తెలిపారు. వ్యవసాయోత్పత్తులకు చేయూతనిచ్చి రైతులను ఆదుకోవడం కంటే వారికి డబ్బులిచ్చి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రైతులను కాంగ్రెస్ కాపాడుతుందనీ, మేనిఫెస్టోలో ప్రకటించిన పలు హామీలతో పాటు ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణతో లబ్ధి పొందారనీ, కుటుంబ పాలనను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్ణయిస్తే కేసీఆర్ భూస్వామ్య పాలనను కూలదోస్తామని, ఇది ఇప్పటికే నిర్ణయించ‌బ‌డింద‌నీ, కాంగ్రెస్ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. కొత్త ప్రభుత్వం మొదటి నెల నుంచే ఆరు హామీలను అమలు చేస్తుందని రేవంత్ స్ప‌ష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios