Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యర్థుల దాడిలో అన్నదమ్ముల హతం, నిజామాబాద్ లో దారుణం

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నగర నడిబొడ్డున ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. అందరూ చూస్తుండగానే నగరంలోని ఓ మైదానంలో  అన్నదమ్ములను పట్టుకుని కత్తులతో దాడి చేశారు. దీంతో అన్నా,తమ్ముడు మృతి చెందగా వారి స్నేహితుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

Brothers killed while playing cricket in nizamabad

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నగర నడిబొడ్డున ఇద్దరు అన్నదమ్ములను ప్రత్యర్థులు నరికి చంపారు. అందరూ చూస్తుండగానే నగరంలోని ఓ మైదానంలో  అన్నదమ్ములను పట్టుకుని కత్తులతో దాడి చేశారు. దీంతో అన్నా,తమ్ముడు మృతి చెందగా వారి స్నేహితుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విదంగా ఉన్నాయి. నగరంలోని హమాల్ వాడి ప్రాంతానికి చెందిన కళ్యాణ్ యాదవ్(30), నర్సింగ్ యాదవ్(28) అన్నదమ్ములు. వీరు అదే కాలనీకి చెందిన ఓ వర్గంతో గతంలో పలుమార్లు గొడవ పడ్డారు. దీంతో వీరిపై కక్షతో రగిలిపోతున్న ప్రత్యర్థులు అదును కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ అన్నదమ్ములిద్దరిపై నిన్న అర్థరాత్రి సమయంలో మరో ఇద్దరు యువకులు కత్తులతో దాడికి దిగారు. మొదట తమ్ముడు నర్సింగ్ యాదవ్ ను కత్తులతో చాతిపై పొడవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత అన్న కళ్యాణ్ యాదవ్ ని పట్టుకున్న దుండగులు అతడి గొంతు కోశారు. అయితే వీరి దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రేమ్ కుమార్ పైనా దాడిచేశారు. ఇలా దుండగుల దాడిలో గాయపడిన కళ్యాణ్ యాదవ్ కూడా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

ఈ దాడిలో గాయపడిన ప్రేమ్ కుమార్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఈ దారుణానికి పాల్పడిన నిందితులు తల్వార్ సాయి, రంజిత్ లను అరెస్ట్ చేశారు.  వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  

  

Follow Us:
Download App:
  • android
  • ios