శివరాంపల్లిలో పేలుడు కలకలం: వ్యక్తికి గాయాలు
హైద్రాబాద్ లోని శివరాంపల్లిలో పేలుడు సంబవించింది. ఈ పేలుడులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: హైద్రాబాద్ పట్టణంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో ఆదివారం నాడు పేలుడు సంబవించింది.ఈ పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు.
పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ 280 నెంబర్ పిల్లర్ వద్ద పేలుడు సంబవించింది. ఓ వ్యక్తి చేతిలోని డబ్బాలో ఉన్న కెమికల్ వల్ల పేలుడు సంబవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చేతిలోనే డబ్బా పేలిపోవడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించినట్లుగా తేలుస్తోంది
ఈ బాక్స్ ను తెరిచిన వ్యక్తి పేరు అలీ అని.. అతను సమీపంలో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడని పోలీసులు చెబుతున్నారు. దానిని తెరచిన వెంటనే అతని చేతులు ఎగిరిపడ్డట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ బాక్స్ ను అతను ఎక్కడి నుండి తీసుకొచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.