Asianet News TeluguAsianet News Telugu

పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నావ్: విశ్వేశ్వర్ రెడ్డిపై బీజేపీ సెటైర్

టీఆర్ఎస్ పార్టీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మండిపడ్డారు. అమరుల కోసం తాను రాజీనామా చేశానని చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి వారి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  

bjp leader krishna sagar rao counter on viswesvara reddy to join congress
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:44 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మండిపడ్డారు. అమరుల కోసం తాను రాజీనామా చేశానని చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి వారి కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  

టీఆర్ఎస్ ను వదిలివెళ్లేందుకు ఐదు కారణాలు చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి ఆనాడు ఎందుకు నోరు మెదపలేదన్నారు. కారుకు పంక్చర్‌ కాబోతుందని ముందే తెలిసి పార్టీ మారుతున్నారన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై కౌంటర్ వేశారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాడంటూ అభిప్రాయపడ్డారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరిస్థితి మరింత భ్రష్టు పట్టిందని విమర్శించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

అసదుద్దీన్ పై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios