దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు.. అందుకే నన్ను గెలిపించారు: రఘునందన్ రావు
దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు కాబట్టే బీజేపీని గెలిపించారని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు చెప్పారు.
సిద్దిపేట: దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు కాబట్టే బీజేపీని గెలిపించారని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు చెప్పారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసిన గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
also read:దుబ్బాక బైపోల్, ట్విస్టిచ్చిన సీఈఓ శశాంక్ గోయల్: ఆ నాలుగు ఈవీఎంలు లెక్కించలేదు
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫలితం చివరకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.దుబ్బాక స్థానం నుండి గతంలో రెండు దఫాలు రఘునందన్ రావు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించిన బీజేపీ నాయకత్వం ఈ స్థానంపై కేంద్రీకరించింది.
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగింది.ఇవాళ ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నిక ఫలితాలపై ఆసక్తి నెలకొంది. చివరి రౌండ్ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితం నెలకొంది.