నా భార్యకు రెండో పెళ్లి చేయండి లేఖ రాసి ఆత్మహత్యాయత్నం
ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్: ఓ ప్రైవేట్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న చిత్తలూరి శ్రవణ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శ్రవణ్ కుమార్ భార్య అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించింది.
తన భార్యకు రెండో పెళ్లి చేయాలని శ్రవణ్ సూసైడ్ నోట్ లో రాశాడు. ఈ మేరకు తండ్రిని ఉద్దేశించి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు.
also read:అమీనాపూర్ ఘటనపై ఎస్పీ: బోయ్ప్రెండ్తో సినిమాకు, రేప్ నాటకం
ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన యువతితో శ్రవణ్ కుమార్ కు వివాహమైంది. జూబ్లీహిల్స్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. హెచ్డిఎఫ్సీలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆర్ధిక సమస్యల కారణంగా శ్రవణ్ కుమార్ కుంగిపోయాడు.
ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా కుంగిపోయిన శ్రవణ్కుమార్ శనివారం నాడు పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య అతడిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది.
శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నాన్నా అప్పులు వసూలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి.. నా భార్యకు రెండో వివాహం చేయాలని ఆ సూసైడ్ నోట్ లో కోరారు.
తన బాకీ డబ్బులు వసూలు చేసి పెట్టడంతో తన తండ్రికి ఎవరైనా సహకరించాలని శ్రవణ్ కుమార్ ఆ లేఖలో కోరారు. తన బాకీ డబ్బులతోనే అంత్యక్రియలు చేయాలని శ్రవణ్ ఆ లేఖలో కోరాడు.తన చావుకు ఎవరూ కారణం కాదని ఆ లేఖలో పేర్కొన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.