Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 28వరకు అసెంబ్లీ: కృష్ణానదిపై ఏపీ ప్రాజెక్టులు, కరోనాపై చర్చకు సర్కార్ ఓకే

ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరిగింది.

BAC decides to conduct Telangana assembly session till sept 28
Author
Hyderabad, First Published Sep 7, 2020, 4:08 PM IST

హైదరాబాద్: ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకొంది.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరిగింది.

ఈ నెల 8వ  తేదీన పీవీ శత జయంతి ఉత్సవాలపై సభలో చర్చ జరగనుంది. కరోనాతో పాటు కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం చర్చకు అంగీకరించింది. 

ఈ నెల 12,13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులను ప్రకటించారు. 17 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

also read:బీఎసీ సమావేశంలో కేసీఆర్, భట్టి విక్రమార్క మధ్య వాడీ వేడీ చర్చ

ప్రతి రోజూ గంట పాటు క్వశ్చన్ అవర్ నిర్వహించనున్నారు. 6 ప్రశ్నలను మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. అరగంట పాటు జీరో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, బెల్ట్ షాపులు,  పోడు వ్యవసాయం, పాత సచివాలయం  కూల్చివేత, ఎస్సీ, ఎష్టీ సబ్ ప్లాన్, కొత్త విద్యావిధానం, బీసీ సబ్ ప్లాన్ తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios