Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడినే భర్త అంటూ ఇల్లు అద్దెకు తీసుకుని.. ఓ జవాన్ భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి...

ఓ ఆర్మీ జవాన్ భార్య దారుణానికి తెగబడింది. భర్త దేశసేవలో ఉంటే తాను మాత్రం ప్రియుడినే భర్త అని చెబుతూ.. ఇల్లు అద్దెకు తీసుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

army jawan wife extramarital affair with lover caught red handedly by husband in hyderabad
Author
Hyderabad, First Published May 20, 2022, 9:04 AM IST

హైదరాబాద్ : extramarital affairలు పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. పెద్దలను, పిల్లలను రోడ్డున పడేస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ.. ఏకంగా భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టిందో మహిళ. ఈ వ్యవహారం హైదరాబాద్ లో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని రహమత్ నగర్ లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. కాగా, జవాన్ భార్య.. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా ఏకంగా ప్రియుడినే తన భర్త అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని రాసలీలలు కొనసాగిస్తోంది.

ఇదిలా కొనసాగుతుండగా అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్ ఏకాంతంగా ఉన్న భార్య, ప్రియుడు జ్ఞానేశ్వర్ ను చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. వారిద్దరిని ఇంట్లోనే ఉంచి తాళం వేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో జవాన్ ఇంటికి వచ్చిన పోలీసులు.. తాళం తీసి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా,  జవాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని జవాన్ తెలిపాడు. ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఆమె మరో వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. ఆమె తనను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా, మే 3న ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో ఓ మహిళతో extramarital affair కారణంగా ఓ యువకుడిని murder చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలియడంతో అతను నేరుగా courtలో లొంగిపోయాడు. నిందితుడిని కస్టడీలో తీసుకున్న పోలీసులు ఆదివారం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సిఐ శ్రీధర్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సాతంరాయి ప్రాంతానికి చెందిన ఓ మహిళ  భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇంట్లో బీహార్కు చెందిన రాహుల్ అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు సదరు మహిళ ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. ఈ క్రమంలో ఆమెకు బీహార్కు చెందిన రేణు అలియాస్ రాను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కూడా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే సాతంరాయిలో ఉంటున్న రాహుల్ తరచూ సదరు మహిళను కలవడంతో పాటు ఫోన్ లో మాట్లాడేవాడు. దీనిని గమనించిన రేణు అతనితో గొడవ పడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు జోక్యం చేసుకుని ఇద్దరిని హెచ్చరించి పంపించారు. నిరుడు డిసెంబర్ లో  కొండపల్లి కి వచ్చిన రాహుల్ సమీపంలోని రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు.  దీనిని గుర్తించిన అతడిని వెంబడించి వెనకనుంచి రాయితో తలపై గట్టిగా కొట్టడంతో ట్రాక్ మధ్యలో బోర్లా పడిపోయాడు. రాహుల్ చనిపోయినట్లు  గుర్తించిన రేణు  బీహార్ కు పారిపోయాడు.

అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెల ఈ కేసును రైల్వే పోలీసులు శంషాబాద్ పీఎస్ కు బదిలీ  చేయడంతో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రేణు కోసం బీహార్ వెళ్లగా అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్టు చేస్తారని భావించిన రేణఉ ఏప్రిల్ 25న రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అనుమతితో రేణును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించారు. ఆదివారం సంఘటనా స్థలం వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు.  తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరు పరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios