అప్సర కేసు దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. అప్సరను హత్య చేసిన స్థలానికి సాయిని తీసుకెళ్లిన పోలీసులు, కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే సాయి ఆమెను హత్య చేయడానికి 15 రోజుల ముందే ఆలయానికి సమీపంలో గొయ్యి తవ్వించినట్లుగా పోలీసులు నిర్ధారించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. హత్యకు 15 రోజుల ముందే నిందితుడు సాయికృష్ణ గుడి వెనుక 20 అడుగుల గొయ్యి తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే దానికి సమీపంలోని ఆసుపత్రి సిబ్బంది అడ్డుకోవడంతో సాయి తన ప్లాన్ మార్చుకున్నాడు. ఆలయానికి సమీపంలో మ్యాన్హోల్ పక్కనే వున్న స్థలంలో గుంత తీసి అప్సర మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు సాయి. మరోవైపు.. అప్సరను హత్య చేసిన స్థలానికి సాయిని తీసుకెళ్లిన పోలీసులు, కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.
మరోవైపు.. అప్సరకు ఇంతకు ముందే పెళ్లైందని.. భర్తతో కలిసి ఉన్న ఫొటోలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఫొటోల్లో ఉన్న కార్తీక్ రాజా అనే వ్యక్తి తల్లి ధనలక్ష్మి ఓ ఆడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. తన కొడుకు కార్తీక్ రాజు ఆత్మహత్యకు అప్సర, ఆమె తల్లి వేధింపులే కారణం అంటూ ఆమె చెప్పడం ఇప్పుడు కేసులో మరో ట్విస్ట్ తెరలేపింది. వివరాల్లోకి వెడితే.. చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత డబ్బుల కోసం, టూర్లకు వెళ్లాలంటూ అప్సర తన కొడుకును వేధించేదని.. లగ్జరీ లైఫ్ కోసం అతడిని హింసించేదని కార్తీక్ తల్లి ధనలక్ష్మి తెలిపింది. అప్సర, ఆమె తల్లి అరుణల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆడియోలో పేర్కొంది.
Also Read: అప్సర హత్య కేసులో కొత్త ట్విస్ట్...సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !...
కార్తీక్ రాజా మీద ఒకసారి అప్సర పోలీస్ కేసు కూడా పెట్టిందని...దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని తెలిపింది. ఈ అవమానాన్ని తట్టుకోలేక కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని.. ఆమె తన ఆడియోలో తెలిపింది. ఆ తరువాతి నుంచి అప్సర, ఆమె తల్లి అరుణ కనిపించలేదన్నారు.
దీంతో ఇప్పుడు అప్సరకు అంతకుముందే పెళ్లయిందా?.. ఈ విషయం అప్సర ఇంట్లో తెలుసా..? ధనలక్ష్మి చేస్తున్న ఆరోపణలు నిజమేనా? ఫోటోల్లో అప్సరతో పాటు ఉన్నది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయికృష్ణ తండ్రి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత మూడు నెలలుగా తన కొడుకును అప్సర తీవ్రంగా వేధిస్తోందని.. టార్చర్ భరించలేకపోతున్నానని కొడుకు అన్నాడని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ శంషాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. అప్సర తల్లి మాట్లాడుతూ... ‘అప్సర మూడో తేదీ కోయంబత్తూర్ వెడతానని చెప్పి వెళ్లింది. బస్సులో వెడుతున్నానని చెప్పింది. తరువాత ఫోన్ కలవలేదు. దీంతో స్నేహితుడైన సాయికృష్ణకు పదే పదే ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఆ తరువాత ఆదివారం సాయికృష్ణ మా ఇంటికి వచ్చాడు. అప్సర స్నేహితులతో భద్రాచలం వెడతానంటే తానే భద్రాచలం పంపించానని చెప్పాడు. నువ్వెలా పంపిస్తావు.. నీకేం అధికారం ఉందని.. సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అన్నా.. దానికి సమాధానం దాట వేశాడు.
