Asianet News TeluguAsianet News Telugu

ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం: హెడ్ కానిస్టేబుల్ మృతి

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Ap Minister Balineni Srinivasa Reddy convoy meets with accident in Hyderabad
Author
Hyderabad, First Published Jul 7, 2020, 12:26 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.హైద్రాబాద్ గచ్చిబౌలి నుండి విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

Ap Minister Balineni Srinivasa Reddy convoy meets with accident in Hyderabad

మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి బోల్తాపడినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మరణించాడు. మరో  ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

గచ్చిబౌలి నుండి విజయవాడకు వెళ్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులోని కోహెడ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం టైరు పేలిపోవడంతో ఆ వాహనం రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో ఈ వాహనంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ స్పాట్ లోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హయత్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios