మరో పరువు హత్య: యువకుడ్ని మద్యం తాగించి చంపేశారు
నాలుగేళ్ళ క్రితం తిరుమలగిరికి చెందిన ఓ యవతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నందకిశోర్ పెళ్లి చేసుకున్న యువతిది మరో కులం.
హైదరాబాద్: తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. సికింద్రాబాదులోని తిరుమలగిరిలో ఈ హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే యువకుడిని భార్య తరుఫుబంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు..
నాలుగేళ్ళ క్రితం తిరుమలగిరికి చెందిన ఓ యవతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నందకిశోర్ పెళ్లి చేసుకున్న యువతిది మరో కులం.
నమ్మించి నందకిషోర్ను యువతి ఇంటికి బంధువులు పిలిపించారు. అతనికి మద్యం తాగించారు. ఆ తర్వాత బండరాళ్లతో కొట్టి చంపేశారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.