Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో ఏపీలో 4157 కరోనా కేసులు: ఏడు వేలు దాటిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 37వేల 049 కి చేరుకొన్నాయి. 

andhra pradesh reports 4157 new corona cases, total rises to 9,17,049 lns
Author
Hyderabad, First Published Apr 14, 2021, 4:51 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 37వేల 049 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 18 మంది మరణించారు. కరోనాతో  నెల్లూరులో నలుగురు,చిత్తూరుచ కృష్ణా జిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు. విశాఖలో ఇద్దరు మరణించారు. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు.  .దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,339 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,55,34,460 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,732 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో4,157 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,606 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 01 వేల 327 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 28,383 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 297, చిత్తూరులో 517,తూర్పుగోదావరిలో 617,గుంటూరులో 434, కడపలో 112,కృష్ణాలో 135, కర్నూల్ లో 386, నెల్లూరులో 276,ప్రకాశంలో 230, శ్రీకాకుళంలో 522, విశాఖపట్టణంలో 417, విజయనగరంలో 154,పశ్చిమగోదావరిలో 060కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -70,081 మరణాలు 611
చిత్తూరు  -94,173,మరణాలు 899
తూర్పుగోదావరి -1,27106, మరణాలు 638
గుంటూరు  -83,517, మరణాలు 688
కడప  -57,571, మరణాలు 465
కృష్ణా  -53,531,మరణాలు 695
కర్నూల్  -63,713, మరణాలు 503
నెల్లూరు -65,802,మరణాలు 529
ప్రకాశం -64, 356,మరణాలు 590
శ్రీకాకుళం -49,112,మరణాలు 351
విశాఖపట్టణం  -65,993,మరణాలు 590
విజయనగరం  -42,337 మరణాలు 238
పశ్చిమగోదావరి -94,862, మరణాలు 542

 

 

Follow Us:
Download App:
  • android
  • ios