Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలిక కిడ్నాప్.. నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష..!

మరోసారి తమ కుమార్తెను వేధించవద్దని కోరారు. అయితే.. నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు.  ఓ రోజు బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నిందితుడు ఆమెను కిడ్నాప్ చేశాడు.
 

ACCUSED GOT 4 YEARS RIGOROUS IMPRISONMENT CONVICTION
Author
Hyderabad, First Published Nov 15, 2021, 5:16 PM IST


మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన  కేసులో నిందితుడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2015లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లు.. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  ఆ ఫిర్యాదులో నిందితుడు ఆశామల్ల శ్రావణ్ కుమార్ గా పేర్కొన్నారు.

Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరహార దీక్ష వాయిదా.. కారణమిదే..

నిందితుడు శ్రావణ్.. గత కొన్ని నెలలుగా.. మైనర్ బాలికను వేధిస్తూ వస్తున్నాడు. దీంతో.. బాధిత బాలిక.. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో.. వారు శ్రావణ్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. మరోసారి తమ కుమార్తెను వేధించవద్దని కోరారు. అయితే.. నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు.  ఓ రోజు బాలిక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నిందితుడు ఆమెను కిడ్నాప్ చేశాడు.

Also Read: Mlc Elections:ప్రగతి భవన్ నుండి ఏడుగురికి పిలుపు, మాజీ స్పీకర్ కు రాని ఆహ్వానం

అనంతరం బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని వెళ్లి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక కనిపించడం లేదంటూ.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఆ కేసుకు సంబంధించి.. తాజాగా.. న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది. అతనికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు ఇచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios