Asianet News TeluguAsianet News Telugu

జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జేపీ కుమార్ ఇంట్లో సోదాలు: అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ

జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ జేపీ కుమార్ అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారు రూ. 50 కోట్లకు పైగా జేపీ కుమార్ ఆస్తులు కూడబెట్టారని  తెలుగు న్యూస్ మీడియా చానెల్ ప్రసారం  చేసింది. జేపీ కుమార్ భార్య పేరున ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. 

ACB Raids on Jalpally Municipal Commissioner JP Kumar Houses in Hyderabad
Author
Hyderabad, First Published Jul 1, 2022, 12:30 PM IST

హైదరాబాద్:Jalpally  మున్సిపల్ కమిషనర్ JP Kumar  అక్రమాస్తులు కూడబెట్టారని ACB అధికారులు గుర్తించారు. జేపీ కుమార్ భార్య పేరు మీదుగా భారీగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.  మున్సిఫల్ కమిషనర్ వద్ద పీఏగా పనిచేసిన అంజయ్య, డ్రైవర్ యూసుఫ్ ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రూ. 5లక్షలను లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు జల్ పల్లి Municipal Commissioner  జేపీ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిన్నటి నుండి జేపీకుమార్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇవాళ కూడా ఏసీబీ అధికారులు తమ సోదాలను కొనసాగించారు. 

also read:ఏసీబీకి చిక్కిన జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్‌.... రూ.20 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు, రాత్రి కొనసాగనున్న సోదాలు

జేపీ కుమార్ కు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను కూడా ఏసీబీ అధికారులు తెరిచారు. ఈ లాకర్లలో Money తో పాటు, ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జేపీ కుమార్ భార్య పేరున రియల్ ఏస్టేట్, కోల్డ్ స్టోరేజీ ,లగ్జరీ చీరల వ్యాపారం ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. జేపీ కుమార్ వద్ద రూ. 50 కోట్ల అక్రమాస్తులున్నట్టుగా ఏసీబీ అధికారులు చెబుతున్నారు. Hyderabad సహా ఎనిమిది చోట్ల జేపీ కుమార్ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

జేపీ కుమార్ గతంలో ఓ మంత్రి వద్ద పీఏగా పనిచేశారు. మంత్రి వద్ద పనిచేసిన సమయంలోనే జేపీ కుమార్ ఆస్తులు కూడబెట్టారా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు చేస్తున్నారు. లంచం తీసుకుంటూ పలువురు అధికారులు ఏసీబీకి చిక్కారు. మరికొందరు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ సీతారాంను ఈ ఏడాది జూన్ 7న  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  రూ. 70 వేలు అంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడంతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  

ఘట్ కేసర్ మండలంలోని అవుషాపూర్  గ్రామంలో గ్రామ కంఠానికి చెందిన రెండు ఫ్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రార్ సీతారాం లంచం  తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. సుదర్శన్ అనే వ్యక్తి నుండి సీతారాం లంచం తీసుకున్నాడు. 

హైద్రాబాద్ నగరంలోని శంషాబాద్ లో  సంగారెడ్డి మండల  పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో ఈ ఏడాది మే 12న  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డికి భారీగా అక్రమాస్తులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

సురేందర్ రెడ్డి ఇంట్లో సుమారు కోటి రూపాయాల నగదును కూడా ఏసీబీ సీజ్ చేశారు. సురేందర్ రెడ్డి ఇంట్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. కోటి రూపాయాల విలువైన విల్లా, రూ. 43.80 లక్షల ఓపెన్ ప్లాట్, రూ. 8.11 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 129.2 తులాల గోల్డ్ ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారని సమాచారం. శంషాబాద్ లో పంచాయితీ అధికారిగా పనిచేసిన సురేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడినట్టుగా పలుఆరోపణలున్నాయి. 

ఎంపీవో సురేందర్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్టుగా తమకు సమాచారం వచ్చిందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు.  ఈ సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించామన్నారు. హైద్రాబాద్ అల్వాల్ నివాసంలో రూ. 2.31 కోట్లు గుర్తించామన్నారు. సురేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన ఆస్తుల విలువ  రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వివరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios