లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్( జీహెచ్ఎంసీ) ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో ఏఎంవోహెచ్గా పని చేస్తున్న వెంకట రమణ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. క్యాటరింగ్ సర్వీస్ యజమాని వద్ద వెంకట రమణ రూ. 60 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వెంకట రమణ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

