ఓటుకు నోటు కేసు: నిందితులపై అభియోగాల నమోదు
ఓటుకు నోటు కేసులో నిందితులపై మంగళవారం నాడు కోర్టు అభియోగాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ పై అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ కోర్టు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితులపై మంగళవారం నాడు కోర్టు అభియోగాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ పై అభియోగాలు నమోదు చేసింది ఏసీబీ కోర్టు.
నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసింది ఏసీబీ కోర్టు. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదు చేసింది కోర్టు. తమపై అభియోగాల్లో నిజం లేదని తోసిపుచ్చిన రేవంత్, ఇతర నిందితులు.
సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసింది కోర్టు. ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామన్న ఏసీబీ. కోర్టు ప్రకటించింది.