(వీడియో) ఈ తెలంగాణా పాట కొత్తది... బాధ పాతది
తెలంగాణా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో ఉంది. త్యాగాలుచేసిన సాధించిన తెలంగాణాలో కూడా రైతు చతికిలపడిపోతున్నాడు. ప్రజలు కోరిన తెలంగాణా రాలేదని, ఇది నయా జాగీర్దారీ అని, నిరంకుశ ప్రభుత్వం అని తెలంగాణ జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు, ప్రజాతెలంగాణా స్థాపనకు జనసమీకరణచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాట వెలువడిండి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
ఈ పాట పాతది కాదు, ఈ పాటకి ప్రాణం పోసిన బాధ మాత్రం పాతదే. ఈ పాట వింటే, ఎపుడు ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణా ఉన్నపుడు ప్రజల ముందు వాస్తవం నిలబెట్టేందుకు గుండె పిండి అల్లిన గీతమనిపిస్తుంది. కాని, అది ఇప్పటి తెలంగాణా రాష్ట్రం బాధ. తెలంగాణా ‘నయా జాగీర్ధారీ’ లో మారని రైతుల జీవితం.
తెలంగాణా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో రెండో స్థానంలో ఉంది. త్యాగాలుచేసిన సాధించిన తెలంగాణాలో కూడా రైతు చతికిలపడిపోతున్నాడు. ప్రజలు కోరిన తెలంగాణా రాలేదని, ఇది నయా జాగీర్దారీ అని, నిరంకుశ ప్రభుత్వం అని తెలంగాణ జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నారు, ప్రజాతెలంగాణా స్థాపనకు జనసమీకరణచేస్తున్నారు.
ఈ పాటకి నేపథ్యం ఇదేనేమో...